ప్రజావాణికి 67 దరఖాస్తుల స్వీకరణ

జోగులాంబ గద్వాల 30 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల కలెక్టర్ కార్యాలయములోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 67 మంది తమ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు.ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యెక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగ్ రావులతో కలసి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు.వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.