ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు
ముండ్ల దిన్నె మద్దిలేటి కుటుంబ సభ్యులు.
జోగుళాంబ గద్వాల 5 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : మండలం ముండ్లదిన్నె గ్రామానికి చెందిన బజారన్న కుమారుడు కే మద్దిలేటి గత సంవత్సరము (21.10.2025) పిడుగుపాటుకు మరణించడం జరిగినది. వారికి ప్రభుత్వం నుండి వచ్చిన జీవో కాపీని మద్దిలేటి కుటుంబ సభ్యులకు ఈరోజు అందజేయడం జరిగినది. (ఎక్స్ గ్రేషియా 6,00,000 ఆరు లక్షలు). ఈ అమౌంట్ మీ ఖాతాలో జమ కావడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది.
అనంతరం కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కి మరియు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.