ఈరోజు రేపు రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం

మధ్య బంగాళాఖాతం లో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడననం ఈ రోజు ఉదయం వాయగుండంగా మారింది.దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా, రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా బారి వర్షాలు కురుస్తున్నాయి.ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అదికారులు హెచ్చరికలు చేస్తున్నారు.ఈ రోజు, రేవు తెలంగాణ రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు తో పాటుగా అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని హేచ్చరిస్తున్నారు.ప్రస్తుతం బంగాళా ఖాతం వాయగుండం కొనసాగుతుంది..రేపు తెల్లవారజామున తీరం దాటే అవకాశం కళింగపట్నం, విశాఖపట్నం, గోపాల్ పూర్ తీరాప్రాంతాలు దాటే అవకాశం ఉందని తెలంగాణ భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే జిల్లాలో నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి,జోగులంబ గద్వాల్ నారాయణపేట ఉన్నాయని తెలిపారు.
రెడ్ అలెర్ట్
▪️జయశంకర్ భూపాల పల్లి
▪️ములుగు
▪️భద్రాద్రి కొత్తగూడ
▪️ఖమ్మం
▪️సూర్యాపేట
పై జిల్లాలో అత్యంత భారీ వర్షాలు నేపథ్యం లో రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ(IMD)
పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలు
జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం,సూర్యాపేట భారీ వర్షాలు కురిసే అవకాశం..
ఈరోజు ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం..
తెలంగాణ లో 30-40 కిమీ ఎదురు గాలులు వీచే అవకాశం..
అత్యధికంగా నారాయణపేట లో 13 సెమి వర్షపాతం నమోదైంది..