వైకాపాలో సజ్జల, విజయసాయిరెడ్డి కూడా ఉండరు: షర్మిల

Sep 20, 2024 - 18:32
 0  2
వైకాపాలో సజ్జల, విజయసాయిరెడ్డి కూడా ఉండరు: షర్మిల

తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీపై కేంద్ర హోంశాఖకు లేఖ

అమరావతి: తిరుమల లడ్డూలో కల్తీపై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. “గవర్నర్ను కలిసి లడ్డూ కల్తీ
వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. వైకాపా విశ్వసనీయతను కోల్పోయింది. వైఎస్ఆర్ మంచి పేరు సాధిస్తే.. జగన్ చెడ్డపేరు తెచ్చుకున్నారు.హామీలు అమలు చేయకుండా గతంలో మోసం
చేశారు. రుషికొండపై ఆయన కబ్జాలు చేశారు.వైఎస్ఆర్కు జగన్కు పొంతనే లేదు. వైకాపా అంతం అయినట్లే.. ఆ పార్టీలో జగన్ తప్ప ఎవరూ
మిగలరు. సజ్జల, విజయసాయిరెడ్డి కూడా అందులో ఉండరు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు
అమలు చేయాలి” అని షర్మిల తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333