స్వతంత్ర దినోత్సవ వేడుకలకు పెరేడ్ గ్రౌండ్ ముస్తాబ్

Aug 14, 2024 - 20:29
 0  2
స్వతంత్ర దినోత్సవ వేడుకలకు పెరేడ్ గ్రౌండ్ ముస్తాబ్

కరీంనగర్ జిల్లా: ఆగస్టు14:- స్వాతంత్ర దినోత్సవ వేడు కలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్ ముస్తాబయింది. వేడు కలను ఘనంగా నిర్వహిం  చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

బుధవారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో రిహార్సల్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పోలీసు బలగాలు హాజరై కవాతు, గౌరవ వందనం, వివిధ పాఠశాలల విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు రిహార్సల్స్ నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ లక్ష్మీనారాయణ, అనూక్ జయ కుమార్. అడ్మిన్ ఆర్ ఐ రజనీకాంత్. ఎం టి ఓ కుమారస్వామి. సాట్ టీం ఆర్ఐ జానీ మియా లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333