సిమెంటు బ్రిక్స్ ను ప్రారంభించిన కొత్త కళ్యాణ్ కుమార్
చిన్నంబాయి మండలం వెలగొండ గ్రామంలో సూర్య కుర్మయ్య మరియు భారతి గారి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన బ్రిక్స్ ఓపెనింగ్ కార్యక్రమం ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ యువనేత కొత్త కళ్యాణ్ కుమార్.
కొత్త కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో అతిథులుగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, చిన్నంబావి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ , గ్రామ సీనియర్ నాయకులు మరియు మాజీ ఎంపీటీసీ మహదేవ్ గౌడ్ , నాగరాజు, మాజీ ఎంపీటీసీ అంజనేయులు, కాంగ్రెస్ నాయకులు జ్యోతి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బ్రిక్స్ ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు.