సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

May 1, 2024 - 19:57
May 1, 2024 - 20:05
 0  40
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి:- మతోన్మాద ఫాసిస్టు బిజెపిని ఓడించండి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్ లో పార్టీ గ్రామ కార్యదర్శి నల్లగొండ నాగయ్య జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు అలుగుబెల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ మేడే పోరాట స్ఫూర్తితో మతోన్మాద బిజెపి ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు పోరాటాలను తీవ్రతరం చేయాలని అన్నారు ప్రజలను దోపిడీ చేసి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న మతోన్మాద ఫాసిస్టు బిజెపిని ఓడించాలని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు కోడులుగా తెచ్చి శ్రామిక వర్గ హక్కులకు బిజెపి కేంద్ర ప్రభుత్వం మరణ శాసనం రాసిందని అని అన్నారు కార్మికుల సంక్షేమం హక్కులకు రక్షణ లేదు ఆవేదన వ్యక్తం చేశారు వేలాది సంవత్సరాలుగా కలిసిమెలిసి భిన్న మతాల ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తూ శ్రమజీవుల ఐక్యతపై దాడి చేస్తున్నది ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి కార్మికుల కనీస వేతనం జీవో నిర్ణయించాలి కార్మికులకు సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలి జిపి విద్యుత్ మిషన్ భగీరథ తదితర రంగాల కార్మికులను ఫార్మేట్ నెట్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలలు దాటుతున్న రాష్ట్ర మంత్రివర్గం ఏర్పడినప్పటికీ నేటికీ కార్మిక మంత్రిని కేటాయించలేదు అని అన్నారు ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యూ జిల్లా కార్యదర్శి కంచర్ల నర్సక్క పోతురాజు ప్రతాప్ కళంచర్ల లింగయ్య నాయిని వినయ్ కొరివి మంగమ్మ లచ్చమ్మ నాగమ్మ వరికుప్పల మల్లయ్య కొరివి అంజయ్య కర్రే ఎల్లయ్య సంఘం వీరయ్య బాదే రాములు తదితరులు పాల్గొన్నారు