సాయిబాబా గుడి సమీపంలోని ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించండి

Apr 23, 2025 - 21:45
Apr 24, 2025 - 19:33
 0  12
సాయిబాబా గుడి సమీపంలోని ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించండి

ఆక్రమణకు గురైనా సాయి బాబా గుడి సమీపంలోని సర్వే నెంబర్ 117 గల ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించండి కలెక్టర్ గారు.

ఆక్రమణకు గురైన స్థలంలో రెవిన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ను తొలిగించి నివాసాన్ని కొనసాగిస్తున్న దుర్మార్గుల పై తక్షణ చర్యలు చేపట్టాలి...

వారిని తక్షణమే అక్కడనుండి తొలిగించి ప్రభుత్వ భూములను కాపాడాలి.

వారిపై చట్ట పర చర్యలు చెపట్టాలి...

బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండా కౌశిక్ డిమాండ్.

జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేత.

 భూభారతి చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు.

జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్...

 చర్ల మండల కేంద్రంలో ని రాహుల్ విజ్ఞాన్ భవన్ లో నేడు ఏర్పాటు చేసిన భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సు కై విచ్చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండా కౌశిక్ మండలంలోని సమస్యలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కొండా కౌశిక్ మాట్లాడుతూ చర్ల మండల కేంద్రంలోని సాయిబాబా గుడి సమీపంలో గల సర్వేనెంబర్ 117 లో గల ప్రభుత్వ భూమిని ఇటీవల కాలంలో కొందరు దుర్మార్గులు చట్టానికి వ్యతిరేకంగా ఆక్రమించడం జరిగిందని అట్టి విషయాన్ని తెలుకున్న మండల తాసిల్దార్ అట్టి భూమిని సర్వే జరిపి ప్రభుత్వ భూమిగా గుర్తించి ఆ స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డును ఆక్రమణదారులు దొంగతనంగా తొలగించినారని అట్టి విషయాన్ని చర్ల మండల తాసిల్దార్ దృష్టికి అనేకసార్లు వినపత్రాలు ఇచ్చినప్పటికీ చర్యలు శూన్యమని బహుజన సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండ కౌశిక్ చర్ల పర్యటనకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. హెచ్చరిక బోర్డును తొలగించిన దుర్మార్గుల పై వెంటనే రెవిన్యూ అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టకపోవడం కారణంగానే ఈరోజు వారు దౌర్జన్యంగా అక్కడ నివాసం ఉంటున్నారని ఆయన కలెక్టర్ గారికి తెలియజేశారు. ఇట్టి విషయంలో రెవిన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి మానుకోవాలని అన్నారు. ప్రభుత్వ అధికారులు స్వాధీనపరచుకున్న అట్టి ఇండ్లలో అక్రమ దారులు నివాసం ఉండడం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించి దౌర్జన్యంగా అక్కడే నివసిస్తున్న దుర్మార్గులపై చట్ట పరమైన చర్యల్ని తక్షణమే చేపట్టి వారిని అక్కడనుండి ఖాళీ చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని ఆయన కలెక్టర్ గారిని కోరారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

 ప్రభుత్వ భూమిలో రెవిన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలిగించిన వారిపై రెవిన్యూ అధికారులు స్వాధీన పర్చుకున్న ఇండ్లలో నివాసం ఉంటున్న దుర్మార్గుల పై చట్టపర చర్యలు చేపడతామని తెలిపారు.