శ్రీశ్రీశ్రీ మద్దిలేటి స్వామి ద్వారకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే .

Apr 6, 2024 - 20:06
 0  18
శ్రీశ్రీశ్రీ మద్దిలేటి స్వామి ద్వారకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే .
శ్రీశ్రీశ్రీ మద్దిలేటి స్వామి ద్వారకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే .

జోగులాంబ గద్వాల 6 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-  గద్వాల. నియోజకవర్గం గద్వాల మండలం పరిధిలోని ఎర్రవల్లి పూడూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ మద్దిలేటి స్వామి వారి ద్వారక ని ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి . ప్రారంభించారు. ద్వారకానికి ఎమ్మెల్యే  ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది .


 ఎమ్మెల్యే  మాట్లాడుతూ....


గ్రామంలో నూతన ద్వారకం ఏర్పాటు చేసుకొని ఇతర గ్రామాల నుండి ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు  ఈ గ్రామానికి ముఖద్వారం ద్వారా గ్రామంలో లోపలికి ప్రవేశం కావడం జరుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన చారిక్రాతకమైన కట్టడంతో మద్దిలేటి స్వామి విగ్రహంతో కలిగి ఉన్న ఈ ముఖ ద్వారం చూసి గ్రామానికి కొత్త తోరణం కొత్త అలంకరణ వచ్చే విధంగా ఉన్నది కొత్త గ్రామంలో అడుగు పెడుతున్నట్లు భావన కలుగుతుందని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు ఇదేవిధంగా కలిసి మెలిసి ఉండి గ్రామంలోని ప్రతి ఒక్క కార్యక్రమంలో సోదర భావంతో నిర్వహించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సత్య రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి పూడూరు రఘు, గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు మహిళలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333