వసూళ్లకు పాల్పడుతున్న విలేకరులపై కేసు
వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను బెదిరించి డబ్బుల వసూళ్లకు పాల్పడ్డ ఇద్దరు విలేకరులపై రాయపర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత కొంతకాలంగా ఉపాధ్యాయులే టార్గెట్గా వసూళ్లకు పాల్పడ్డ సదరు విలేకరులపై బాధిత ఉపాధ్యాయులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది