వేములపల్లి తాజా మాజీ ఉపసర్పంచ్ అనిరెడ్డి పద్మ పార్ధివదేహాన్ని నివాళులు

Mar 27, 2025 - 01:12
Mar 27, 2025 - 01:15
 0  5
వేములపల్లి తాజా మాజీ ఉపసర్పంచ్ అనిరెడ్డి పద్మ పార్ధివదేహాన్ని నివాళులు
వేములపల్లి తాజా మాజీ ఉపసర్పంచ్ అనిరెడ్డి పద్మ పార్ధివదేహాన్ని నివాళులు

మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

తెలంగాణ వార్త మిర్యాలగూడ మార్చి 26 :- సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదములో వేములపల్లి గ్రామ మాజీ లిఫ్ట్ ఛైర్మన్ అనిరెడ్డి శేఖర్ రెడ్డి సతీమణి అనిరెడ్డి పద్మ స్వర్గస్తులయినారు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు కాగా ఈ రోజు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులునల్లమోతు భాస్కర్ రావు ఉదయమే కోదాడ చేరుకొని ఆసుపత్రికి వెళ్ళి పోలీస్ శాఖ వారు మరియు వైధ్యులతో మాట్లాడి త్వరితగతిన పోస్టుమార్టం చేయించి పార్ధివదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయి౦చారు.. తదుపరి అనిరెడ్డి పద్మ పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి ఆకాల మరణం పట్ల ప్రగడా సంతపాన్ని తెలియజేశారు. ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు

నివాళులు అర్పించిన వారిలో నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, చిర్ర మల్లయ్య యాదవ్, నంద్యాల శ్రీరాంరెడ్డి, రఘుమా రెడ్డి, మాలి శేఖర్ రెడ్డి, జావీద్, బండ్ల మట్టయ్య మరియు గ్రామ పెద్దలు, నాయకులు, శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

Vallapudasu Kiran Miryalaguda Reporter Nalgonda Dist Telangana State