వడదెబ్బ నుండి ప్రజలు రక్షించుకోవాలి
ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని సూచించిన సారథి ప్రభుత్వ కళాకారులు
జోగులాంబ గద్వాల 12 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ప్రస్తుత మండే ఎండాకాలంలో ప్రజలందరూ వడదెబ్బ భారి నుండి కాపాడుకొని వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రభుత్వ ఉద్యోగులు పాటల రూపంలో డప్పు కొడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర చైర్మన్ వెన్నెల గద్దర్, జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ఆదేశాలతో డిపిఆర్ఓ ఆరీఫుద్దీన్ సౌజన్యంతో సాంస్కృతిక సారథి జిల్లా ప్రభుత్వ కళాకారుల అధ్యక్షులు మొహమ్మద్ రాహుల్ నేతృత్వంలో సోమవారం మల్దకల్ మండలం మద్దెల బండ గ్రామంలో ప్రజలు కళాకారులు ప్రసాద్.రమాదేవి.కేశవులు.భూపతి. హజరత్. స్వామి.కవిత.కృష్ణ.ప్రజలకు ఎండల నుండి కాపాడుకోవడానికి తగు జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.