బాల్యవివాహాలను నిర్మూలించాలి
జోగులాంబ గద్వాల 12 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మండలం విఠలాపురం గ్రామంలో సోమవారం ఉపాధి కూలీలకు మహిళా శిశు సంక్షేమ శాఖ వారి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహాలను నివారించడం, బాల కార్మికులను నిర్మూలించడం, వివిధ హింసల నుండి పిల్లలను రక్షించడం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
జిల్లా బాలల సంరక్షణ అధికారి నరసింహ మాట్లాడుతూ బాలలందరు శ్వేతాయుత వాతావరణం లో పెరగాలని, చిన్న వయస్సులో పెళ్ళిలు చేయడం చట్ట రీత్యా నేరమని, బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే సమస్యలు, నష్టాలు గురించి అవగాహన కల్పించారు, మరియు బాల కార్మిక వ్యవస్థ వలన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని అందుకే పిల్లలను బడికి క్రమం తప్పకుండా హాజరు అయ్యేలా చేయాలని తల్లితండ్రులకు సూచించారు. బాలల సంరక్షణ కౌన్సిలర్ సురేష్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు పిల్లల పైన ఆధారపడి ఉందని, అందుకు బాలల అభివృద్ధి దేశాభివృద్ధి అని పిల్లలు ఆరోగ్య వంతం గా విద్యాతో పాటుగా ఆటలలో రాణించాలని అన్నారు, బాలలపై ఏవిధమైన వేధింపులు, అకృత్యాలు, హింస జరగకుండా ఉండటంతో పాటు పిల్లలంతా ఆనందంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లితండ్రులు మీద ఉందని అన్నారు . మరియు బాల్య వివాహాలు, బాల కార్మికులు మరియు బాలల పై జరిగే శారీరక, మనషిక మరియు లైంగిక వేదింపులు నుండి రక్షణకై చైత్యనం అవ్వాలని మరియు ఇట్టి సమాచారాన్ని 1098 కాల్ చేసి సమాచారం అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ కౌన్సిలర్ సురేష్, ఉమెన్ హబ్ చిట్టెమ్మ, చైల్డ్ లైన్ కళావతి, ఫీల్డ్ అసిస్టెంట్ దేవరాజు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు .