రైతులకు అండగా ఉంటాం మాజీ సీఎం కేసీఆర్
తిరుమలగిరి 01 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- రైతులకు ఎలాంటి ఆపద వచ్చిన అండగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గం లోని వెలుగుపల్లి గ్రామంలో రైతుల పంటలు ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్నలు ఏడుస్తుంటే… ఢిల్లీలో రేవంత్ షికార్లు చేస్తున్నారని అన్నారు. లక్షల ఏకరాలలో పంట ఎండినా పట్టించుకోని కాంగ్రెస్.. సర్కార్ అని అన్నారు. రైతులకు ఎప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.రైతుల ఉసురు రేవంత్ సర్కార్ కు తగులుతుందన్నారు. ఎండిన రైతుల పంట పొలాల గురించి సర్కార్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. రైతులు అధైర్య పడవద్దు అని అన్నారు. తమది రైతు ప్రభుత్వం అని తమ ప్రభుత్వ హయాంలో రైతులు రాజుగా బతకాలని కాంగ్రెస్ హయాంలో రైతులకు ఇబ్బంది ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల పంట ఎండిపోయిన రేవంత్ సర్కార్ కి ఏమాత్రం పట్టింపు లేకుండా ఉందన్నారు.రైతులు తమ ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ కు చూపించారు. ఆయన వెంట శ్రీనివాస్ గౌడ్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బండ ప్రకాష్,ఎమ్మెల్సీ రవీందర్ రావు, క్యామ మల్లేశం, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సూర్యాపేట జెడ్పి పర్సన్ గుజ్జ దీపిక తదితరులు ఉన్నారు.