రేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 13 మంది విద్యార్థులకు అస్వస్థత

Feb 20, 2024 - 21:11
Feb 20, 2024 - 21:24
 0  3
రేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 13 మంది విద్యార్థులకు అస్వస్థత

జోగులాంబ- గద్వాల 20 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-  ఫుడ్ పాయిజన్‌తో 13 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం భోజనం చేసిన అనంతరం విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, తలనొప్పితో బాధపడుతుండడంతో వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్‌ సౌమ్య తెలిపారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి దవాఖానకు చేరుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వారి విద్యార్థుల ను ఇండ్లకు పంపించారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State