రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ముగ్గురికి గాయాలు

Aug 26, 2024 - 19:58
 0  6

గాయపడిన వారిని పోలీస్ వాహనంలో తరలించి మానవత్వం చాటుకున్న పోలీసులు 

అడ్డగూడూరు 26 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తొర్రూర్ వలిగొండ జాతీయ రహదారి పై యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో బొడ్డుగూడెం స్టేజి సమీపంలో సోమవారం రోజు సుమారు సమయం 3-4 గంటలకు ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను పోలీసు వాహనంలో తరలించి మానవత్వం చాటుకున్నా అడ్డగూడూరు పోలీసులు హెడ్ కానిస్టేబుల్ వెంకన్న , కానిస్టేబుల్ జి సైదులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు మండలంలోని డి.రేపాక గ్రామానికి చెందిన గుండ తరుణ్  తిరుమలగిరి నుండి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అలాగే తొర్రూర్ మండలంలోని చికాటాయపాలెంకు చెందిన  మంగళపల్లి మల్సూర్, వేల్పుకొండ మహేందర్, పోచంపల్లి వెళ్లి తిరిగి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు బొడ్డుగూడెం స్టేజి వద్ద  ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు పోలీసులకు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌ ఆలస్యం కావడంతో గాయపడిన మాల్సూర్, మహేందర్ పోలీసులు పెట్రోలింగ్‌ వాహనంలో చాడ వరకు తీసుకువెళ్ళారు.అక్కడకు 108 అంబులెన్స్‌ రావడంతో అందులో భువనగిరి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333