మిషన్ భగీరథ త్రాగునీరుకు అంతరాయం
మేనేజ్మెంట్ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన వాటర్ మెన్
జోగులాంబ గద్వాల 11 జూన్ 2020 5 తెలంగాణ వార్తా ప్రతినిధి : ధరూర్ మండల పరిధిలో ఉన్న నీలహల్లి గ్రామంలో మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. నిత్యం ఏదో ఒక సమస్యతో నీటి సరఫరా నిలిచిపోతూనే వస్తుంది. గ్రామానికి సరిపడ నీరు సరిపోవటం లేదని వాటర్ మెన్ మిషన్ భగీరథ మేనేజ్మెంట్కు తెలిపినప్పటికీ వారు పట్టించుకోవటం లేదని వాటర్ మెన్ ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం గ్రామంలోని ప్రజలు బోరు బావుల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఉన్నత అధికారుల స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.