ప్రభుత్వ పాఠశాలలో తనఇద్దరు పిల్లలను చేర్పించిన ఉపాధ్యాయుడు నరేష్
అడ్డగూడూరు 20 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ఆజీంపేట ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ జి టి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నరేష్ ఉపాధ్యాయుడు వారి ఇద్దరూ పిల్లలను రిషిక 3వ తరగతిలో రిషి దేవ్ 2వ తరగతిలోను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి బీద విద్యార్థుల తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఇలాంటి పంతులు ఉంటే మన ఊరు బడి మనబడి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉంటుందని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన తల్లిదండ్రులు అన్నారు.