మానవత్వాన్ని చాటుకున్న స్నేహితులు మృతుని కుటుంబానికి 26 వేల "రు ఆర్థిక సహాయం

Oct 9, 2024 - 22:07
 0  5
మానవత్వాన్ని చాటుకున్న స్నేహితులు మృతుని కుటుంబానికి 26 వేల "రు ఆర్థిక సహాయం

అడ్డగూడూరు 08 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన పిల్లి సతీష్ అనారోగ్యంతో గత నెల 30వ తేదీన మరణించడంతో వారి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు భువనగిరి గురుకుల పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి పిల్లి సతీష్ అకాల మరణంతో వారి కుటుంబానికి గురుకుల పూర్వ విద్యార్థులు అందరూ కలిసి 26 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు 8 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వారి కుటుంబానికి బాల్య మిత్రులు ఎల్లవేళలా అండగా ఉంటామని ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో గురుకుల పూర్వ విద్యార్థులు ఉప్పుల శాంతి కుమార్, బాలెంల అవినాష్, చిప్పలపల్లి వంశీ కుమార్, కందుకూరి దినేష్, మంగలపల్లి భూపాల్, మోత్కూర్ ప్రభుత్వ  కాలేజ్ పూర్వ విద్యార్థులు సందీప్, అశోక్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333