మానవత్వం చాటుకున్న గద్వాల ఎమ్మెల్యే

Jun 24, 2024 - 16:44
Jun 24, 2024 - 17:06
 0  13
మానవత్వం చాటుకున్న గద్వాల ఎమ్మెల్యే
మానవత్వం చాటుకున్న గద్వాల ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల 24 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల్:-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. ధరూర్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ప్రత్యేక వాహనం లో దవాఖానకు తరలించి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.సోమవారం గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల లో  కారు బైక్ ఢీకొనడంతో  ద్విచక్ర వాహన వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  రోడ్డు ప్రమాదం‌ విషయం తెలియడంతో వెంటనే కారు‌ దిగి ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి గాయపడిన వ్యక్తిని పరామర్శించి వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులతో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ విజయ్ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State