మరణించిన  పోలీసు కుటుంబానికి చెక్ అందజేసిన జిల్లా ఎస్పీ  రితిరాజ్,IPS  .

May 22, 2024 - 18:09
 0  17
మరణించిన  పోలీసు కుటుంబానికి చెక్ అందజేసిన జిల్లా ఎస్పీ  రితిరాజ్,IPS  .

జోగులాంబ గద్వాల 22 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి.:- అనారోగ్యం కారణంగా మరణించిన పోలీస్ అధికారి కుటుంబ సభ్యులకు   జిల్లా ఎస్పీ  రితిరాజ్, IPS  ఇన్సిడెంటల్ చార్జెస్ క్రింద 10,000/- రూపాయాల చెక్ ను అందజేసారు.

 ఇటిక్యాల పోలీస్ స్టేషన్ లో  విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్  ఈ సంవత్సరం జనవరి నెల లో మరణించగా  వారి కుటుంబ సభ్యులకు ఇన్సిడెంటల్ చార్జెస్ క్రింద 10,000/-  రూపాయల చెక్ ను    జిల్లా  ఎస్పీ  అందజేశారు. ఈ సందర్భంగా  జిల్లా ఎస్పీ  వారి కుటుంబ స్థితి గతులను, వారి పిల్లల విద్యా అభ్యసన వివరాలను తెలుసుకొని మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. వారి కుటుంబానికి రావాల్సిన మిగిలిన బెనిఫిట్స్ అన్ని కూడా త్వరగా వచ్చేందుకు కృషి చేయాలని కార్యాలయ ఏ ఓ ని ఆదేశించారు.
    ఈ కార్యక్రమములో కార్యాలయ ఏ. ఓ సతీష్ ,  సూపరింటెండెంట్ నాగేందర్  , హెడ్ కానిస్టేబుల్  భార్య రాజేశ్వరి పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333