బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన వంటేరు ప్రతాపరెడ్డి 

Apr 6, 2024 - 18:47
Apr 8, 2024 - 17:31
 0  10
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన వంటేరు ప్రతాపరెడ్డి 

తెలంగాణ వార్త కొండపాక:- శనివారం కొండపాక మండలంలోని పలువురు భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను మండల పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ తో కలిసి మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ *వంటేరు ప్రతాపరెడ్డి  పరామర్శించడం జరిగింది.

రాంపల్లి గ్రామంలో రైతు విభాగం అధ్యక్షులు కానుగంటి రాజిరెడ్డి తల్లి గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా శనివారం రోజు రాజిరెడ్డి గారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

రాంపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎలుక రాజిరెడ్డి భార్య వైరల్ ఫీవర్ తో చికిత్స పొంది ఇంటికి రాగా వారిని పరామర్శించడం జరిగింది.

సిరిసినగండ్ల గ్రామంలో మాజీ సర్పంచ్ రాజగిరి శ్రీనివాస్  ఇటీవల గుండె ఆపరేషన్ కాగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిలను తెలుసుకోవడం జరిగింది.

తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో వార్డు సభ్యులు ఎర్రగోళ్ల బాలయ్య తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పిస్క అమరేందర్, చిట్కుల్ సురేందర్ రెడ్డి, MD. అహ్మద్, ఎలక రాజిరెడ్డి, చెంది మల్లికార్జున్, గూడెపు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, రాములు, వీరేశం, శ్రీనివాస్, కాశిరెడ్డి మహిపాల్ రెడ్డి, సున్నం భాస్కర్, సాదుపల్లి కనకసేన, వంగ శ్రీనివాస్, పాండు గౌడ్ ,పాశం కనుకయ్య, యాదగిరి, బాలరాజ్, భూములు, నర్సింలు, కొమ్ము స్వామి, పల్లె బాబు, గుర్రాల రాజు, రాకేష్ గౌడ్, దత్తు మొదలైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

T.Sathya Goud Kndapaka Mandal Reporter Siddipet District Telangana State