బాధిత కుటుంబాలను పరామర్శించిన జెడ్పి మాజీ చైర్ పర్సన్ సరిత...
జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.
గద్వాల్:- పట్టణంలోని దౌదర్ పల్లిలో సేల్ టవర్ కోసం భూమిలో ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ల షాట్ సర్క్యూట్ తో చాకలి రాముడు కి చెందిన ఎద్దు మరియు కుర్వ జగదీష్ కి చెందిన మేక విద్యుత్ షాక్ తో మృతి చెందిన విషయం తెలుసుకున్న జెడ్పి మాజీ చైర్ పర్సన్ సరిత సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వం తరపున అందుకోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సేల్ టవర్ యజమన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సరిత సూచించారు.పశు వైద్య అధికారులు,పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని పంచనామ నిర్వహించారు.వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మండల నాయకులు తదితరులు ఉన్నారు...