పుప్పాల సత్యమ్మ మృతదేహానికి పూలమాల వేసిన డేవిడ్ కుమార్

Mar 21, 2024 - 20:07
Mar 21, 2024 - 21:01
 0  3
పుప్పాల సత్యమ్మ మృతదేహానికి పూలమాల వేసిన డేవిడ్ కుమార్

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్  పుప్పాల సత్తమ్మ మృతి ఉద్యమానికి తీరని లోటు టి పి టి ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పుప్పాల వీరన్న మాతృమూర్తి పుప్పాల సత్యమ్మ గారు మృతి చెందారు. ఆమె భౌతికయానికి *సిపిఐ( ఎం_ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం. డేవిడ్ కుమార్* పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎం.డేవిడ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ పుప్పాల సత్తెమ్మ అర్థ రాత్రి వచ్చిన విప్లవ కారులకు అన్నం పెట్టి అదరించిదని ,ఆమె పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉందని అన్నారు. పుప్పాలగూడెం గ్రామానికి విప్లవూద్యమ ఘన చరిత్ర ఉందని, ఈ గ్రామానికి కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి నుండి పొట్ల రామ నరసయ్య లాంటి యోదను యోధులు కలియతిరిగిన ప్రాంతమని అన్నారు.

  అనేకమంది విప్లవకారులకు ఆశ్రయమించిన, కనీసం శత్రువుకు సమాచారం ఇవ్వలేదని కొనియాడారు. కామ్రేడ్ సత్తెమ్మ లాంటి అనేకమంది త్యాగదనులు పార్టీ కోసం త్యాగాలు చేశారని,వారి త్యాగాలు గొప్పవని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ,సత్తెమ్మకు విప్లవ జోహార్లు అర్పించారు. అమర వీరుల ఆశయాల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. *ఈ అంత్యక్రియలలో టి పి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముప్పాని కృష్ణ రెడ్డి, టి పి టి ఎఫ్ జిల్లా నాయకులు సుభాన్ ,పూలన్,ముస్కు వెంకట్ రెడ్డి,రవి కుమార్ ,సిపిఐ(ఎం_ఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంట నాగయ్య,సబ్ డివిజన్ కార్యదర్శి కునుకుంట్ల సైదులు, పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలెబోయిన కిరణ్ కుమార్, ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు,అరుణోదయ జిల్లా కార్యదర్శి కంచనపల్లి సైదులు,పార్టీ డివిజన్ నాయకులు జిలేరు, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు సామ నర్సి రెడ్డి, ఎ ఐ కె ఎం ఎస్ జిల్లా నాయకులు ఎస్ కె మైబెల్లి,అరుణోదయ జిల్లా నాయకులు బోల్క పవన్,పి డి ఎస్ యు డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్, దండి ప్రవీణ్,శ్రీధర్, శ్రావణ్,సోమయ్య,బిక్షం వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*