ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పటల్ ఘనంగా ప్రారంభోత్సవం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర విద్యానగర్ లో వినూత్న హాస్పిటల్ దగ్గర ప్రైమ్ చిల్డ్రన్ హాస్పిటల్ ను ముసుకూల వెంకటరెడ్డి పూలమ్మ దంపతులు రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. డాక్టర్ మహేందర్ రెడ్డి నవజాత శిశువు & పిల్లల వైద్య నిపుణుల నేతృత్వం లో నడపబడుచున్నది. పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు, చికిత్స, ఎన్ ఐ సి యు అండ్ పి ఐ సి యు సౌకర్యం , 24 గంటల శిశు సంరక్షణ, ల్యాబ్ అండ్ ఫార్మసీ సౌకర్యం, పిల్లలకు మెరుగైన వైద్యం కోసం ఏర్పాటు చేసిన హాస్పటల్ అని డాక్టర్ మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరెడ్డి బిక్షం రెడ్డి, సీతమ్మ, ముదిరెడ్డి లక్ష్మారెడ్డి, హాస్పటల్ యాజమాన్యం, పాల్గొన్నారు.