ప్రపంచo గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను పూర్తిస్థాయిలో అందించాలి
* తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్
(సూర్యాపేట టౌన్,ఏప్రిల్14)
ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఈద్గా రోడ్ లోని రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన 134 వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గుర్తించబడటం గొప్ప విషయం అన్నారు. గత ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైనదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆలోచనతో పాలను అందించాలని కోరారు. విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లోనే బుడ్డి దీపాల కింద చదువుకున్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదిగారని కొనియాడారు. ఆయన రాసిన గొప్ప రాజ్యాంగము వల్లనే నేడు దేశంలో చట్టాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను అందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ ప్రస్తావించిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు, అనే దానిని ఒంటి పట్టించుకుని లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరిస్తూ అడుగడుగునా తెలంగాణ రాష్ట్రం వివరిస్తూ, బోధిస్తూ.. ఎక్కడైనా తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరిగిన పోరాడుతూ అంబేద్కర్ చూపిన బాటలో నడవాలి అన్నారు. ఆయన రాసిన భారత రాజ్యాంగం లో ఆర్టికల్ - 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పుకొచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎకరం స్థలంలో స్మారక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి కంభంపాటి అంజయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షురాలు స్వప్న రవి బాలస్వామి k. బాలరాజు బి రమేష్ సునీత పట్టణ కోశాధికారి గిరీష్ సారా గండ్ల సైదులు , పట్టణ గౌరవ సలహాదారులు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి , బానోతు జానీ నాయక్ , పెగ్గే పురం నరసయ్య ,తదితరులు పాల్గొన్నారు.