ప్రతి ఒక్కరూ సమాజ సేవను అలవర్చుకోవాలి

May 23, 2024 - 20:07
 0  6
ప్రతి ఒక్కరూ సమాజ సేవను అలవర్చుకోవాలి

 హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు  దైద వెంకన్న 

 సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గాయకురాలు దాచేపల్లి లక్ష్మి కుమారుడు దాచేపల్లి గణేష్ జర్మనీ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్తున్నా శుభ సందర్భంలో ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కుడ కుడ లొ శ్రీ అన్నపూర్ణ వృద్ధుల దివ్యాంగుల అనాధాశ్రమంలో  అన్నదానము పండ్ల పంపిణీ చేశాముఈ కార్యక్రమానికి హోప్ మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు దైద వెంకన్న దాచేపల్లి లక్ష్మి ఆమె కుమారులు గణేష్ మణికంఠ అనాధలకు అన్నదానం పండ్లు పంపిణీ చేశారు

  అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు విద్య ఎంత కష్టమైనా  ఇష్టంతో విద్యనభ్యసించి వారి కన్నా తల్లిదండ్రులకు గ్రామానికి విద్యాసంస్థలకు జిల్లాకు రాష్ట్రానికి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలన్నారు ప్రతి ఒక్కరూ వృద్ధుల పట్ల అనాధలు దివ్యాంగుల పట్ల ప్రేమ పూర్వకంగా ఉండాలన్నారు వారికి సహాయ సహకారాలు అందించాలన్నారు ప్రతి ఒక్కరూ సమాజ సేవను అలవర్చుకోవాలన్నారు. దాచేపల్లి గణేష్ జర్మనీలో ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు గణేష్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకురాలు దేవరకొండ వనజ శ్రీనివాస్, భాస్కర్ ,స్వీటీ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333