ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి:ఎస్సై చంద్రకాంత్
జోగులాంబ గద్వాల 3 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మానవపాడు ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవాలని మండల ఎస్సై చంద్రకాంత్ స్పష్టం చేశారు. బుధవారం మండల కేంద్రంలో మరియు అమరవాయి గ్రామం లో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో పోలీస్ కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై చంద్రకాంత్ మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికలను సజావుగా జరిపించేందుకు ప్రజల సహాయ సహకారం అవసరమని అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఎవరైనా ఓటుకు నోటు ఇస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కవాతు లో ఐటిబిటి ఇన్చార్జి ఇన్స్పెక్టర్ కైలాస్ రామ్, మండలం పోలీస్ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.