ప్రకటించిన ఏఎన్ఎం పోస్టుల్లో ఆశాలను ప్రత్యేక గుర్తించాలి

Jul 8, 2024 - 20:52
Jul 8, 2024 - 21:00
 0  22
ప్రకటించిన ఏఎన్ఎం పోస్టుల్లో ఆశాలను ప్రత్యేక గుర్తించాలి

జోగులాంబ గద్వాల 9 జులై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి గద్వాల:- జిల్లాలో  ప్రకటించిన ఏఎన్ఎం పోస్టుల్లో ఆశలను ప్రత్యేకంగా గుర్తించాలని జోగులాంబ జిల్లా కేంద్రంలో సోమవారం డి ఎం హెచ్ ఓ శశికళ మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ సిద్ధప్ప లకు ఆశా కార్యకర్తలు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం  ఆశ కార్యకర్తలు మాట్లాడుతూ..... హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎన్నో సంవత్సరాలుగా పది సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆశా కార్యకర్తలు పని చేస్తున్నాము. కనుక ఇప్పుడు జిల్లాలో ప్రకటించిన ఏ ఎన్ ఎం  పోస్టుల్లో  ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన ఆశ కార్యకర్తలను ప్రత్యేక గుర్తించి వెయిటేజీ ఇవ్వాలని వారు ఆమెను కోరారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబాలను లెక్కపెట్టకుండా  వైద్య అధికారుల ఆదేశానుసారం పని చేశామని అన్నారు.

 ఇప్పటికీ ఎన్నో సర్వేలు చేస్తూ, ఆన్లైన్ సర్వీసులు అందిస్తున్నాను ఉన్నతాధికారులు  ఇప్పటికైనా గుర్తించాలని వారు కోరారు. ఈ విషయమై డిఎంహెచ్వో సానుకూలంగా స్పందిస్తూ  మీ విషయాన్ని ఉన్నతాధికారులకు రిఫర్ చేస్తానని వారికి అన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఆర్ సులోచన, శివమ్మ,  జ్యోతి, లక్ష్మి, లక్ష్మీదేవిలు తదితరులు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State