వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్, గద్వాల ఎమ్మెల్యే.

Jul 18, 2024 - 20:22
 0  15
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్, గద్వాల ఎమ్మెల్యే.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్, గద్వాల ఎమ్మెల్యే.

జోగులాంబ గద్వాల 19 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-  రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, ఎల్ డి ఎం  అయ్యపు రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.   కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చిత్ర పటానికి శాసన సభ్యులు పాలాభిషేకం చేశారు. పండగ వాతావరణంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333