ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు కబ్జా చేసిన భూకబ్జాదారుడు
జోగులాంబ గద్వాల 9 జులై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఎర్రవల్లి. మండలంలోని సాస నూలు గ్రామ.శివారులో. సర్వే నంబర్ 202. 203లో అప్పటి ప్రభుత్వము. 2-19. రెండెకరాల 19 గుంటలు భూమి కొనుగోలు చేసి నిరుపేద ప్రజలకు పట్టాలి ఇచ్చి ఉంది. ఇట్టి భూమిని ఒక వ్యక్తి.కబ్జా చేసి ఉన్నారు. దీనిపైన ఎన్నోసార్లు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము. మరియు. మండల రెవెన్యూ అధికారికి. ఆర్డిఓ కి జిల్లా కలెక్టర్ కి ఎన్నోసార్లు కంప్లీట్ లు చేయడం జరిగింది. ప్రభుత్వము కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్ మరియు రైతులకు ఇచ్చిన పట్టా కాగితాలు.వినతి పత్రాలు కూడా ఇచ్చి ఉన్నాము.
దీనిపైన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి తక్షణమే చర్యలు తీసుకొని పేద ప్రజలకు ఇచ్చిన పట్టాల భూమిని సర్వే చేయించి హద్దులు చూపించగలరని. లేకుంటే భూ కబ్జాదారుడు మళ్లీ పంట చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈరోజు జిల్లా కలెక్టర్ ముందు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పట్టా కాయితాలు డాక్యుమెంటు మండల తాసిల్దార్ కి సమర్పించాము. వెంటనే దీనిపైన విచారణ చేసి ఎందుకు సర్వే చేయించలేకపోతోంది ప్రభుత్వం అని ప్రజలు నిలదీస్తున్నారు.?
ఇట్టి విషయాన్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయవలసిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు.