పుష్పాలంకరణలో పిల్లలమర్రి లక్ష్మీ నాథుడు 

May 30, 2025 - 19:09
 0  19
పుష్పాలంకరణలో పిల్లలమర్రి లక్ష్మీ నాథుడు 

సూర్యాపేట రూరల్ (పిల్లలమర్రి) మే 30: మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అర్చకుడు ముడుంభై రఘువరన్ ఆచార్యులు స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా అర్చకుడు మాట్లాడుతూ జిల్లాలో ఉత్తర ముఖం కలిగిన పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి విశేషంగా భక్తుల సహకారంతో పుష్పాలంకరణ సేవను ప్రతి శుక్రవారం నిర్వహిస్తామని తెలిపారు.దివ్య శోభాయమానంగా దర్శనమిచ్చే లక్ష్మీ నాధుడను దర్శిస్తే కోటి జన్మల పుణ్యఫలం అన్నారు.బావిలో వెలసిన స్వామికి అభిషేకం ప్రీతి అని ప్రతి రోహిణి నక్షత్రం రోజున ఉదయం స్వామి వారి నిజ రూప దర్శనం తదుపరి పంచామృత అభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఉమ్మెంతల హరిప్రసాద్, ఆలయ ఛైర్మెన్ గుకంటి రాజబాబు రెడ్డి,కమిటీ సభ్యులు, భక్తులు ముడంభై సారిక, పశ్య రాజశేఖర్ రెడ్డి మంజుల దంపతులు,గవ్వ అహల్య, మెరెడ్డి సువర్ణ,గుజ్జ శ్రీదేవి,గవ్వ విజయలక్ష్మీ, అంకం భిక్షం మల్లీశ్వరి తదితర భక్తులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333