పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకారం అందించాలి. టూరిజం శాఖ చైర్మన్ రమేష్ రెడ్డి

Feb 2, 2026 - 20:45
 0  2
పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకారం అందించాలి. టూరిజం శాఖ చైర్మన్ రమేష్ రెడ్డి

తెలంగాణ వార్త ఆత్మకూరుఎస్ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకారం అందించాలి. టూరిజం శాఖ చైర్మన్ రమేష్ రెడ్డి.. ఆత్మకూరు ఎస్... గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ నిధులతో పాటు దాతలు సహకారం ఉంటే పాఠశాల అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కందగట్ల కు చెందిన వెంకటచారి రెండు లక్షల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలకు 300 లీటర్ల కెపాసిటీ వాటర్ ప్లాంట్ మధ్యాహ్నం భోజన కోసం గ్యాస్ సిలిండర్లు వంట సామాగ్రిని బహుకరించగా రమేష్ రెడ్డి గారి చేతుల మీద సోమవారం ప్రారంభించారు. సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలో పూర్వం చదువుకున్న వారు ఉన్నత స్థాయిలో ఉద్యోగులుగా వ్యాపారులుగా అభివృద్ధి చెందారు. ఆర్థికంగా సరిపడినవారు చదువుకున్న పాఠశాలలను దత్తత తీసుకొని విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం స్ప్రెడ్ ఇండియా తరపున తన సోదరుడు శ్రీధర్ రెడ్డి పాఠశాలలో విద్యార్థుల అవసరాలను పరిష్కరించేందుకు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పాఠశాలల అభివృద్ధి కోసం విదేశాల్లో స్థిరపడ్డ భారతీయ పౌరు లు ఎందరో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని వారిని సరైన సమయంలో అవసరమైన చోట సహకారం పొందాలని ఆయన సూచించారు. గ్రామాల్లో గుడులకంటే బడులకు సహకారం అందించి పేద విద్యార్థుల ఉన్నతికి కృషిచే యాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో రామాలయం నిర్మాణం కోసం సహకారాలు అందించాలంటే గ్రామస్తులు పటేల్ రమేష్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. పాఠశాల లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్య కల్పించేందుకు గ్రామానికి చెందిన కొలులింగారెడ్డి ముందుకొచ్చారు. పాఠశాలకు వాటర్ ప్లాంట్ గ్యాస్ సిలిండర్లు అందజేసిన వెంకటాచారి అతని కుమారున్నీ పటేల్ రమేష్ రెడ్డి అభినందించారు. అనంతరం గ్రామస్తులు పటేల్ రమేష్ రెడ్డి శాలువాలు పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కు వాటర్ ఫ్లాంట్ 300లెటర్ ల కెపాసిటీ మద్యాన భోజనం కోసం గ్యాస్ స్టవ్ కనెక్షన్ సీలేంటర్ లు. సుమారు రెండు లక్షలు రిటైర్డ్ lic ఉద్యోగి కాటూరి వెంకటాచారి. పటేల్, ఎంఇఓ ధారాసింగ్ ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ రామాంజనేయులు ఉపసర్పంచ్ పోల్డాస్ రాధ, విద్యా కమిటీ చైర్మన్ ఉపేంద్ర , అనంతరెడ్డి, సత్యం లింగారెడ్డి, రాజయ్య, నర్సిరెడ్డి, జలంధర్ రెడ్డి, సంద జానయ్య వెంకట్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.