కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు.. ఎమ్మార్పీఎస్

Feb 2, 2026 - 20:43
 0  0
కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు.. ఎమ్మార్పీఎస్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. ఆత్మకూరు ఎస్.. రాజకీయంగా అగ్ర నాయకులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు దళిత యువకుడిని పోలీసుల చిత్రహింసలతో హత్య చేసి తప్పించుకుంటున్న వారు వదిలేది లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సోమవారం మండల పరిధిలోని నెమికల్లు ఎస్సీ కాలనీలో కర్ల రాజేష్ సంతాప కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజేష్ మృతికి పరోక్షంగా ప్రత్యక్షంగా కారకులైన రాజకీయ నాయకులు ప్రజాప్రతితులు పోలీసు అధికారులను కఠినంగా శిక్షించే వరకు ఉద్యమం ఆగదని అన్నారు. ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చే అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతూ రాజేష్ కుటుంబాన్నీ కనీసం పరామర్శించకపోవడం అన్నారు.దళితులపై జరిగే అన్యాయాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేష్ మృతికి కారకులైన ఎస్సై పై ఎస్పి పై చర్యలు తీసుకోవాలని ఆ డిమాండ్ చేశారు. ఈనెల 5న సూర్యాపేటలో జరిగే రాజేష్ సంతాప సభకు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ , చిన్న శ్రీరాములు మాదిగ ఎడవల్లి ముత్తయ్య, ఎర్ర వీరస్వామి, బత్తుల ప్రసాద్, ఏతాకుల వెంకన్న, యాతకుల రాజయ్య, బోల్లపాక సైదులు, శేఖర్, చిన్ని, జగన్, గరిగంటి ప్రకాష్,