నడిగడ్డ ఇలవేల్పు శ్రీశ్రీ జమ్మిచేడు జమ్మలమ్మ తల్లి పుట్టినింటి నుండి మెట్టినింటికి రాక...
జోగులాంబ గద్వాల 21 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా నడిగడ్డ ఇలవేల్పు శ్రీ శ్రీ జమ్మిచేడు జమ్ములమ్మ బుధవారం పుట్టినిల్లు అయినటువంటి గుర్రం గడ్డ నుండి మెట్టినిల్లు జమ్మి చెడు కు ఎడ్ల బండి పై అంగరంగ వైభవంగా తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హాజరయ్యారు. నడిగడ్డ ఇలవేల్పుగా కొలిచేటి అమ్మవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు ఇక్కడి ప్రజలు ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ముందుగా జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారిని కొలిచిన తర్వాతనే వారి ఇళ్లల్లో శుభకార్యాలను మొదలుపెడతారు .
ఈ బ్రహ్మోత్సవాలకు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఇతర రాష్ట్రాల నుండి లక్షల్లో భక్తులు వచ్చి అమ్మవారిని కొలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పల్లకి సేవలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత అనంతరం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి మొక్కలు తీర్చుకున్నారు. ఇక్కడ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలు పలు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని అన్నారు. వారి వెంట జమ్మిచేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్,తిమోజి,సురేష్, రాముడు, నాగరాజు, కౌన్సిలర్ భాస్కర్ యాదవ్, డిటిడిసి నర్సింలు, ఏకే వెంకటన్న,వెంకటేష్, జయరాములు, కొండపల్లి తిరుమలేష్,పరశురామ్,రవి,తదితరులు పాల్గొన్నారు.