దళిత జర్నలిస్ట్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గా రత్నకుమార్

Sep 28, 2024 - 19:59
 0  5
దళిత జర్నలిస్ట్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గా రత్నకుమార్

కొత్తగూడెం సెప్టెంబర్ 28 (  ):తెలంగాణ రాష్ట్ర దళిత జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27 రవీంద్ర భారతి లో దళిత జర్నలిస్టుల ఫోరం చైతన్య సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత జర్నలిస్టు ఫోరం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా అక్కరపు రత్నకుమార్ ను నియమించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాష పోగు  జాన్ రాష్ట్ర  కమిటీ .. రత్నకుమార్ గత రెండు సంవత్సరాలుగా దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు .ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రత్నకుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కమిటీలు వేసి దళిత జర్నలిస్టులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతానని దళిత జర్నలిస్టు ఫోరం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు . నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి రాజు వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333