దరఖాస్తులకు ఆహ్వానం:యం.ప్రసాదరావు

Jun 14, 2024 - 19:15
Jun 14, 2024 - 19:16
 0  4

జోగులాంబ  గద్వాల 14 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా మైనారిటీస్ గురుకుల పాఠశాల మరియు కళాశాలల యందు టీచర్స్, లెక్చరర్స్ కొరకు మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటిస్ సంక్షేమ శాఖ అధికారి యం.ప్రసాదరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.గద్వాల గురుకుల పాఠశాల యందు పిజిటి ఇంగ్లీష్, టిజిటి సైన్స్ పోస్టులకు మరియు అలంపూర్ మండలం ఉండవెల్లి నందు తెలంగాణ మైనారిటీస్ గురుకుల పాఠశాల టిజిటి గణితం, మరియు కళాశాల యందు జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్, ఆర్ట్ & క్రాప్ట్ పోస్టులకు దరఖాస్తులనుకోరుతున్నట్లు తెలిపారు. ఆసక్తి గల గల మహిళ అభ్యర్థులు ఈ నెల 22 తేది లోగా దరఖాస్తులను జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ గద్వాల్ నందు సమర్పించగలరని,  మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 8099059007 సంప్రదించగలరని ఆయన తెలియజేశారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State