తనకు న్యాయం చేయాలని యువతి ఆందోళన

Apr 7, 2024 - 20:14
 0  143
తనకు న్యాయం చేయాలని యువతి ఆందోళన

తనకు న్యాయం చేయాలని చెవ్వెంల మండలం గుర్రం తండాకు చెందిన డుంగ్రోతు భవాని సూర్యాపేట బొడ్రాయి బజార్ లోని తన ప్రేమికుని ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు.  సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రం తండాకు చెందిన  డుంగ్రోతు శ్యామ్ నాయక్ కుమార్తె భవాని స్ధానిక వికాస్ కాలేజ్ నందు డి ఫార్మసి మొదటి సంవత్సరం చదువుతున్నది.  ఆమె అదే కాలేజిలో నాలుగవ సంవత్సరం చదువుతున్న  అంతటి మహేష్ తో ప్రేమలో పడినట్లు, తమ ప్రేమ విషయం కాలేజ్ లో అందరికి  తెలిసిందని అమ్మాయి తెలిపింది.  

  సూర్యాపేట పట్టణంలో బొడ్రాయి బజార్ సమీపంలో నివాసం వుంటున్న  అంతటి మహేష్ తనను ప్రేమించి మోసం చేశాడని అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి మహేష్ ఇంటి వద్ద ఆదివారం నాడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మాయి భవాని మాట్లాడుతూ తాను మహేష్ ని ప్రేమించానని, అతనిని తప్ప మరెవరని పెళ్లి చేసుకోనని, తాను చావుకైనా సిద్దమని అన్నారు.  అమ్మాయి తల్లిదండ్రలు మాట్లాడుతూ మహేష్  తల్లిదండ్రులు తమ కుమార్తె తో వివాహానికి ఇష్ట పడడం లేదని, కులాంతర వివాహం తమకు ఇష్టం లేదని అన్నారని తెలిపారు. తాము ఇప్పటికే సూర్యాపేట షిటీమ్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.  తమ కూతురికి న్యాయం చేసేవరకు పోరాడుతామని అన్నారు.  ధర్నా  చేస్తున్న అమ్మాయి , కుటుంబ సభ్యులను పోలీసులు స్ధానిక పోలీసు స్టేషను ను తరలించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333