డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరుతున్నాయని మహిళల ధర్నా

Apr 18, 2024 - 18:58
 0  12
డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరుతున్నాయని మహిళల ధర్నా
డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరుతున్నాయని మహిళల ధర్నా

జోగులాంబ గద్వాల 18 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- పట్టణంలోని తొమ్మిదవ వార్డులో కొంతమంది స్థలాన్ని ఆక్రమించడంతో డ్రైనేజీ నీరు ముందుకు వెళ్లక ఇళ్లల్లోకి చేరుతున్నాయని మహిళలు ధర్నా నిర్వహించారు. గద్వాల నుండి ధరూర్ వెళ్లే రోడ్డులో రాఘవేంద్ర కాలనీ సమీపంలో మహిళలు ధర్నా నిర్వహించడంతో వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్కడ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333