డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

Jan 24, 2025 - 20:11
Jan 24, 2025 - 20:36
 0  3
డ్రగ్స్,సైబర్ నేరాలపై  అవగాహన  కార్యక్రమం

తెలంగాణవార్త ఆత్మకూరు యస్ డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన ఆత్మకూర్ PS పరిది ఎస్పీ సన్ ప్రీత్ సింగ్  ఆదేశాల మేరకు ఆత్మకూర్ SI శ్రీకాంత్ గౌడ్, మండల కేంద్రంలోనీ కస్తూరిబా గాంధీ పాఠశాల లోసైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.MEO మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి అధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై, సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు,గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నారని తెలిపారు. సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,ATMకార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.HC వీరారెడ్డి  మాట్లాడుతూ సైబర్ మోసాలపై1930టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని వేధింపులపై 100కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు. మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు* గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు. అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థినీలకు అవగాహన* *కల్పించారు.

ఈ కార్యక్రమం నందు కస్తూరీబా గాంధీ పాఠశాల SO సరస్వతి,MVF అధికారి లలిత,కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, క్రిష్ణ, చారీ, గురులింగం, నాగార్జున విద్యార్థినిలు ఉపాధ్యాయినిలు పాల్గొన్నారు.*