జోగులాంబ  గద్వాల్ జిల్లా (R&B) E.E కి వినతి పత్రం అందచేసిన.

Jul 12, 2024 - 18:18
Jul 12, 2024 - 18:20
 0  31
జోగులాంబ  గద్వాల్ జిల్లా (R&B) E.E కి వినతి పత్రం అందచేసిన.

 అయిజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్..
        
జోగులాంబ గద్వాల 13 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  అయిజ. పట్టణం నుండి గద్వాల్ కు వెళ్లే దారిలో ప్రధానంగా అయిజ పాతబస్టాండ్ కూడలిలో మరియు స్థానిక ఆయప్పస్వామి గుడి దగ్గర నుండి కట్టక్రింద తిమ్మప్ప స్వామి గుడి అవతలివరకు దాదాపు (3) కిలోమీటర్ల మేర R & B రహదారి గుంతలు పడి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం వేలాదిమంది ప్రయాణికులు, విద్యార్థులు ప్రయాణించే ప్రధాన రహదారి కావడంతో వీలైనంత త్వరగా రోడ్ ప్యాచ్ వర్క్ ను పూర్తి చేసి అందరికి అందుబాటులో ఉంచాలని కోరారు. ఇట్టి విషయంపై జోగులాంబ గద్వాల్ జిల్లా R&B E. E. కి సమస్యను వివరించడంతో....సానుకూలంగా స్పందించి ఈ నెలాఖరులోపు టెండర్ లు వేస్తామని..కాంట్రాక్టర్స్ వచ్చిన వెంటనే ప్యాచ్ వర్క్ లు పూర్తిచేయిస్తామని హామీ ఇచ్చారు. అడిగిన వెంటనే స్పందించి త్వరలోనే టెండర్స్ వేస్తామని సానుకూలంగా స్పందించిన (R&B) E.E.కి ...అయిజ పట్టణ ప్రజల  తరపున   - అయిజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్ ... అభినందనలు తెలియచేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333