జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ బదిలీ
గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియామకం
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ (IAS 2017) బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఆయనను గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ పదవిలో అదనపు బాధ్యతలు నిర్వహించిన సబ్యసాచి ఘోష్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
కాగా, సంతోష్ స్థానంలో జోగులాంబ గద్వాల జిల్లా కొత్త కలెక్టర్గా ప్రస్తుతం జనగామ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రిజ్వాన్ భాషా షేక్ (IAS 2017) నియమితులయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరు తక్షణమే తమ కొత్త బాధ్యతల్లో చేరనున్నారు..