జూనియర్ డాక్టర్ మౌమిత మరణానికి సంతాపం

Aug 18, 2024 - 23:03
Aug 18, 2024 - 23:05
 0  14

 తెలుపుతూ నిందుతుడిని బహిరంగంగా ఉరి తీయాలని

 కోవోత్తులతో సంతాపం తెలిపిన అడ్డగూడూర్ మండల నాయకులు


అడ్డగూడూరు 18 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ఇటివలే కొలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌమితను కొందరు దుండగులు మానభంగం చేసి హత్యాచారం చేసిన దుండగులను వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని అడ్డగూడూరు మండల కేంద్రంలోని విద్యార్థి నాయకులు బాలెంల అరవింద్,గూడెపు నరేష్,డప్పు గోపి ఆధ్వర్యంలో కోవోత్తులతో నినాదాలు చేసుకుంటూ సంతాపం తెలిపారు.తదనంతరం విధ్యార్థి నాయకులు అరవింద్,నరేష్, గోపిలుమాట్లాడుతూ..దైవంతో సమానం అయిన డాక్టర్ వృత్తిలో ఉన్న వారికే దేశంలో రక్షణ లేదంటే దేశం దేశ ప్రజలు ఎటూ వెళుతున్నారో ప్రజలకే తెలియాలని అన్నారు.ఇప్పటికయిన దుండగులను అరెస్టు చేయడం లాంటివి కాలయాపన చేసే కార్యక్రమాలు మానుకోని వెంటనే దుండగులను బహిరంగంగా ఉరితీసే పనులు శరవేగంగా మొదలు పెట్టి ఉరి తీయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు పరమేష్ గూడెపు,గజ్జెల్లి రవి,తాళ్ళపల్లి క్రిష్ణ,బాలెంల అయోధ్య,గూడెపు పరమేష్,డప్పు బాబు,* ఏలిజాల ప్రవీణ్,పయ్యావుల మత్య్సగిరి,తుప్పత్తి నరేష్,పరిగేలా మహేష్,డప్పు పూర్ణచందర్,గూడెపు నవీన్,గూడెపు గోవర్థన్,మెతుకు చింటు,గుజ్జ రాజు,బాలెంల దుర్గా ప్రసాద్,బాలెంల బన్ని,బాలెంల సిద్దు,బాలెంల శివాజీ,మంద మనీందర్,మంద చిన్నా,గజ్జెల్లి రాహుల్,ఎలిజాల అరుణ్,పెరుమాండ్ల బన్ని,ఎలిజాల నిఖిల్,గూడెపు హరీష్ తదితరులు పాల్గొన్నారు.