ఘనంగా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం

జోగులాంబ గద్వాల 10 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : కలియుగ ప్రత్యక్ష దైవం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీనివాసుని కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఐజ పట్టణానికి చెందిన నవీన్ పర్ణిక దంపతులు కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు దేవాలయం తరపున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్వారి అరవిందరావు చంద్రశేఖర రావు అర్చకులు మధుసూదనాచారి రవి వాల్మీకి పూజారులు పాల్గొన్నారు.