ఘనంగా వసంత పంచమి వేడుకలు
కోల్కతా : వసంత పంచమి పూజ వేడుకలు కోల్కతాలోని MCRS KNOWLEDGE CAMPUS లో సోమవారం ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో కాలేజీ మేనేజ్మెంట్ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు .విద్యార్థులు అపారమైన జ్ఞాన సంపదను పెంపొందించుకోవాలని అన్నారు.విద్యార్థులు రాబోయే పరీక్షలకు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించి కాలేజీకి మంచి పేరును తీసుకురావాలని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నర్సింగ్ ప్రొఫెషన్ ఈ సమాజానికి చాలా అవసరం అని వారు అన్నారు. అనంతరం బెంగాలీ సాంప్రదాయబద్ధంగా డాన్సులు, కోలాటం మరియు నృత్యలుతో విద్యార్థులు అలరించారు.ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్లు నసీముద్దీన్,అబ్దుల్ కరీం, రాజు,ఇమ్రాన్,సర్మిష్టా, నూరాలం తదితరులు పాల్గొన్నారు.