ఘనంగా దేవి శరన్నవరాత్రోత్సవాలు 

Oct 6, 2024 - 19:04
Oct 6, 2024 - 21:12
 0  74
ఘనంగా దేవి శరన్నవరాత్రోత్సవాలు 

నాగారం తెలంగాణవార్త:- దేవిశరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మండలంలోని  పసునూర్, పస్తాల, ఫణిగిరి, నాగారం, నాగారంబంగ్లా, వర్థమానుకోట, మాచిరెడ్డిపల్లి, ఈటూరు, డి.కొత్తపల్లి తదితర  గ్రామాల్లో ఏర్పాటు చేసిన కనకదుర్గా మాత విగ్రహాల  వద్ద  భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4వ రోజు కనకదుర్గ మాత లలితత్రిపురసుందరి దేవి అవతారంలో భక్తులకు  దర్శనమిచ్చింది.  ఈ కార్యక్రమంలో నాతి మహేష్, రాజేశ్వరి, ఆయా గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.