గ్రామస్థాయి విద్యార్థి నమోదు కమిటీ సమావేశం
జోగులాంబ గద్వాల 10 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల. జిల్లా collector ఆదేశంతో ఈ రోజు ZPHS చాగాపురం ఆవరణ యందు "గ్రామ స్థాయి విద్యార్థి నమోదు కమిటీ " సమావేశం జరిగింది. ఈ సమావేశం నందు 5+ వయస్సు గల విద్యార్థులందరిని, బడిబయట గల పిల్లలను బడిలో చేర్పించాలని తీర్మానించడం జరిగింది. దానికి door to door campaign చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశం నందు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్ మరియు ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.