గోవింద నామస్మరణతో మారుమోగుతున్న శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం

Aug 6, 2024 - 18:32
Aug 6, 2024 - 18:38
 0  5

జోగులాంబ గద్వాల 6 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సప్తాహ భజన శనివారం ప్రారంభం కాగా ప్రతిరోజు భజన మండలి సభ్యులచే గోవింద నామస్మరణ చేస్తూ భక్తీని చాటుకుంటున్నారు. భజన మండలి సభ్యులకు, భక్తులకు దాతలు ముందుకు వచ్చి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 మొదటిరోజు శనివారం పెద్దొడ్డి గ్రామానికి నారాయణ జ్ఞాపకార్థం నల్లారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రెండవ రోజు ఆదివారం గద్వాల కాకతీయ టెక్నో స్కూల్, రాత్రి శాంతినగర్ శివ శివాని స్కూల్ వారు అన్నదానం నిర్వహించారు. మూడవరోజు సోమవారం ఐజ గ్రామానికి చెందిన బొజ్జయ్య శెట్టి అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే నాలుగవ రోజు మంగళవారం గట్టు మండలం ఆరగిద్ద గ్రామానికి చెందిన సుజాత రాముడు ఆధ్వర్యంలో ఉదయం, రాత్రి భజన మండలి సభ్యులకు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. అన్నదానం నిర్వహించిన వారి కుటుంబాలకు శ్రీ తిమ్మప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు ప్రార్థించారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State