కూరగాయల మార్కెట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే బండ్ల

Jul 22, 2024 - 18:59
Jul 23, 2024 - 11:34
 0  13

జోగులాంబ గద్వాల 22 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న పాత (మాహరాజ) కూరగాయల మార్కెట్ ను జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్,ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు..

    ఈ సందర్బంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ మహారాజ కూరగాయల మార్కెట్ ఇలా మురికి దుర్గంధంలో ఉండటం బధగా ఉంది..తక్షణమే దీనిని మార్పులు చేస్తమని గత మునిసిపల్ అధ్వర్యంలో కట్టిన ఈ మార్కెట్ సరైన ప్లాన్ డ్రైనేజి,రోడ్లు వంటివి లేకపోవడం వల్ల సమస్య తీవ్రరూపం దాల్చిందని ఇప్పుడు ఈ మార్కెట్ ను పునరుద్ధరణ చేసి మల్లి పుర్వవైభవం తీసుకోస్తమని ఎమ్మెల్యే తెలిపారు..

జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ప్రస్తుత ఈ కూరగాయల మార్కెట్ కు రొడ్డు,డ్రైనేజి వ్యవస్థ సరిగ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడున్నాట్లుగా తెలుస్తుందని నాలుగు షాపులను తొలగిస్తే రోడ్డు సౌకర్యం ఉంటుంది..ప్రజ అవసరాల కోసం నిర్మించిన ఈ కూరగాయల మార్కెట్ వారికి ఉపయోగం కోసం ఎలా చేస్తే బాగుంటుందో అలా పునరుద్ధరణ చేసి ప్రజలకు అందుబాటులో ఈ కూరగాయల మార్కెట్ ను ఉంచుతామని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు  తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333