కానిస్టేబుల్ నుండీ హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి పొందిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్

జోగులాంబ గద్వాల 10 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల్. జిల్లా మనో పాడ్, శాంతి నగర్ పోలీస్ స్టేషన్ ల లో పనిచేస్తు కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి పొందిన శ్రీ కె.చెన్న కేశవులు, శ్రీ ఎన్.వెంకప్ప ల ను జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ తన కార్యాలయంలో అభినందించి వారి ర్యాంక్ పదోన్నతి పట్టీలను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... పదోన్నతులతోనే పోలీసులకు గుర్తింపు తో పాటు, వీధుల పట్ల మరింత ఉత్సాహం వస్తుందని అన్నారు . ఎలాంటి రిమార్క్ లేకుండా మిగిలిన సర్వీసును పూర్తి చేసి విధుల్లో మంచి పనితీరు కనబరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని ఎస్పీ ఆకాంక్షించారు. పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా కృషి చెయ్యాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో శాంతి నగర్ సి ఐ టాటా బాబు పాల్గొన్నారు.